మహానాడు చూసి వైసీపీ నాయకులందరికీ దిమ్మ తిరిగింది !

Telugu Lo Computer
0


ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు పెట్టినా స్వచ్ఛందంగా  మహానాడు కు తరలివచ్చిన వారందరికీ ప్రత్యేక పాధాబివందనాలు. మహానాడు చూసి, వైసీపీ నాయకులందరికీ దిమ్మ తిరిగింది. పిచ్చెక్కిపోయి ఏదేదో వాగుతున్నారని టిడిపి నాయకుడు,మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. కేటుగాడు విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మహానాడు స్మశానమట, అక్కడ భోజనాన్ని పిండాలతో పోలుస్తున్న కేటు నా కొడుకు. ఎన్టీఆర్ పుట్టినరోజు పెట్టిన భోజనం మాకు ప్రసాదంతో సమానం. మీకు పోయే కాలం వచ్చింది... ఇష్టారాజ్యంగా మాట్లాడితే మా కార్యకర్తలందరూ తరిమి, తరమి కొడతారు. మీరొచ్చిన తరువాత మీద నుంచి కింద స్థాయి వరకు అన్ని రకాల ప్రాధాన్యత ఉన్న పోస్టులు రెడ్డీలకు 1,500ల వరకు ఇచ్చారు.. ఇదేనా సమాజిక న్యాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, ఇతర అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించి, సమాజిక న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఏమీ చేయకుండా సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్ర ఏంటి? సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలో వచ్చిందో చర్చ పెడదాం రండి. అలీబాబా 40 దొంగల్లాగా బస్సు ఎక్కి తిరిగితే సామాజిక న్యాయమవుతుందా? దేశంలోనే సామాజిక న్యాయం చేసిన పార్టీ టీడీపీ, దానికి బీజం వేసింది ఎన్టీఆర్. మహానాడు ప్రాంగణం వల్లకాడా? వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని, మిమ్మల్ని ఇదే వల్లకాడులో కట్టగట్టి తగలబెడతారు గుర్తుంచుకో స్పీకర్ సీతారాం. మీ దొంగలు మాట ఎవరూ వినరు... మీ పని అయిపోయింది. మీ బాస్ దగ్గర్నుంచి కింద వరకు అందరూ కేటుగాళ్లే. ఎక్కువగా వాగితే మర్యాదగా ఉండదు. రామారావు బొటనవేలి మీద ఈక కూడా పీకలేరు. 14ఏళ్లు జైల్లో ఉన్న వ్యక్తితో ఎన్టీఆర్ తో పోలికేంటి?

Post a Comment

0Comments

Post a Comment (0)