ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Telugu Lo Computer
0


తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నైలోని పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పదంగా చనిపోయారు. పొరుగు కుటుంబాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి పెద్ద అయిన ఆ వ్యక్తి తొలుత భార్యను, అనంతరం ఇద్దరు పిల్లలను చంపి చివరకు అతడు ఆత్యహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారంలో ఆర్థిక నష్టాలను భరించలేక ఆ కుటుంబం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నదని ఒక పోలీస్‌ అధికారి మీడియాకు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)