కాల్పుల్లో స్కూల్ పిల్లలతో సహా 21 మంది దుర్మరణం

Telugu Lo Computer
0


అమెరికాలోని టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో  జరిగిన కాల్పుల్లో అభంశుభం తెలియని స్కూల్ పిల్లలు మరణించారు. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు, మరో ముగ్గురు మొత్తంగా 21 మంది చనిపోయారు. ఈ విషయాన్ని గవర్నర్ గ్రెగ్ అబాట్ ధ్రువీకరించారు. మొత్తం 21 మందిలో ఇద్దరిని కొన ఊపిరితో ఆస్పత్రికి చేర్చగానే మరణించినట్లు వెల్లడించారు. చనిపోయిన పిల్లల్లో ఎక్కువ మంది 4 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసున్న వారే ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సాల్వడార్ రామోస్ గా పోలీసులు ధ్రువీకరించారు. ఇతడు ఓ హత్య నేరంలో అనుమానితుడిగా ఉన్నాడు. పోలీసులు వెంబడిస్తున్న సమయంలో అతను తన ట్రక్కు నుంచి దిగి రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లోకి ప్రవేశించి స్కూల్ పిల్లలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తెలుసుకుని వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఘటనకు పాల్పడిని రామోస్ ను పోలీసులు కాల్చి చంపేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)