తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతుందని కటుంబసభ్యులు పేర్కొన్నారు. తాటి వెంకటేశ్వర్లు స్వగ్రామం బూర్గంపాడు మండలం సారపాకలో ఈ ఘటన చేసుకుంది. సమాచారం అందుకున్న తాటి వెంకటేశ్వర్లు దమ్మపేట నుంచి బూర్గంపాడులోని సారపాక చేరుకున్నారు. కూతురుని చూసి గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తాటి ఇంటికి చేరుకుంటున్నారు. మహాలక్ష్మి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)