ఇష్టంలేని పెళ్లి చేశారనే మనస్తాపంతో బలన్మరణం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నాచారం రాఘవేంద్రనగర్‌కు చెందిన ఎస్‌.యాదగిరి-పూలమ్మ ల కుమార్తె లావణ్య హబ్సిగూడలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుంది.  రెండు నెలల క్రితం నాచారం ఎర్రకుంటకు చెందిన నాగరాజుతో వివాహం చేశారు. నాగరాజు ఏడో తరగతి వరకే చదువుకున్నాడు. పెళ్లయ్యాక రెండు రోజులే లావణ్య మెట్టినింట్లో ఉంది. అనంతరం పరీక్షలు ఉన్నాయంటూ పుట్టింటికి చేరుకుంది. పూర్తయ్యాక కాపురానికి వెళ్లమని తల్లిదండ్రులు సూచించినా వెళ్ళడం ఇష్టంలేక మనస్తాపానికి గురైంది. శుక్రవారం తల్లి పూలమ్మ కుమార్తె జాతకం చూపించేందుకని సీతాఫల్‌మండికి వెళ్ళగా, యాదగిరి పనికి వెళ్ళాడు. సోదరుడు ప్రశాంత్‌ ప్రత్యేక గదిలో తలుపు వేసుకొని 'వర్క్‌ ఫ్రం హోం' చేస్తున్నాడు. మరో గదిలో లావణ్య ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తలుపులు వేసి ఉండడం గమనించిన తండ్రి తలుపులు పగులకొట్టి చూడగా లావణ్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఇష్టంలేని పెళ్లి చేశారనే కారణంతోనే మనస్తాపానికి గురై మృతిచెందినట్లు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)