హనుమాన్ చాలీసా ఇతరుల ఇళ్లముందు చేస్తేనే ఇబ్బందులు !

Telugu Lo Computer
0


బీజేపీ నేతలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హనుమాన్ చాలీసా పఠిస్తామంటే ఎలాంటి ఇబ్బందీ లేదని రౌత్ స్పష్టం చేశారు. మనస్సు చికాకు ఉన్నప్పుడల్లా చాలీసాను పఠనం చేసుకోవచ్చని అన్నారు. అయితే అది ఇతరుల ఇళ్లల్లోకి చొరబడి చేస్తేనే ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఎవరైనా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామనుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, అయితేవా రివారి ఇళ్లల్లోనో, మందిరాల్లోనో చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర ఇళ్లల్లోకి చొరబడి, ప్రశాంత వాతావరణాన్ని చెడగొడితేనే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)