మదురై - సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Telugu Lo Computer
0


వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మదురై - సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27, జూలై 4, 11, 18, 25 తేదీల్లో (ప్రతి సోమవారం) సాయంత్రం 9.25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07191) మరుసరి రోజు సాయంత్రం 8.45 గంటలకు మదురై జంక్షన్‌ చేరుకుంటుంది. అదే విధంగా మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29, జూలై 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి బుధవారం) ఉదయం 5.30 గంటలకు మదురైలో బయలుదేరే వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (07192) మరునాడు ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లకు శనివారం ఉదయం 8 గంటల నుంచే రిజర్వేషన్‌ ప్రారంభంకానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)