హైదరాబాద్ స్ట్రీట్‌ ఫైట్‌ లో ఒకరు మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో మసీదు నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది.. ఈ ఘర్షణలో 15 ఏళ్ల నవాజ్ అహ్మద్ అనే యువకుడు మృతి చెందాడు… స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి కారణమై, పరారీలో ఉన్న యువకుడిని మొఘల్ పుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో చనిపోయిన యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు  కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)