తెలంగాణలో గత కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో పాఠశాలల పని వేళలను11-30 వరకు ఉండగా, ప్రస్తుతం ఎండల తీవ్రత కొంత వరకు తగ్గింది. దీంతో పాఠశాలలను పాత పని వేళల తోనే నడిపించాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నేటి నుండి రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 వరకు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల ప్రిన్స్పల్స్ కు విద్యా శాఖ పంపించింది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం 12-30 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వులను తెలిపింది.
తెలంగాణలో నేటి నుంచి స్కూల్స్ 12-30 వరకు
April 07, 2022
0