విజయవాడ లో విద్యార్థి సంఘాల ఆందోళన

Telugu Lo Computer
0


జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలని విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. ధర్నాచౌక్‌ కు చేరుకున్న యువతను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాళీ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు ఉద్యోగం వచ్చేవరకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్‌ పోస్టుల భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఉద్యోగాలపై హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని 2.35 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)