మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ముంబై - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్లో జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా నలుగురు ప్రయాణికుల వద్ద ఉన్న 32 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వెంటనే సీజ్ చేశారు. అయితే బంగారు ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తులు పోలీసులకు ఎటువంటి పత్రాలు, జీఎస్టీ డాక్యుమెంట్లు చూపించలేక పోయారు. దీంతో ఆ బంగారం అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలతో ఆ నలుగురు ప్రయాణీకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారాన్ని పోలీసులు ఒడిశా జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు. బంగారాన్ని తరలిస్తున్న ఆ నలుగురు ప్రయాణీకులు ముంబైకి చెందిన హస్ముఖ్లాల్ జైన్, సురేశ్ సహదేవ్ ఖారే, మహేశ్ భోమ్సార్, దీపక్ పటేల్ గా పోలీసులు గుర్తించారు. నాలుగు బాగ్యుల్లో 8 కిలలో చొప్పున బంగారం ఉన్నాయని వాటిని సీజ్ చేశామని తెలిపారు.
కోణార్క్ ఎక్స్ప్రెస్లో పట్టుబడిన బంగారు ఆభరణాలు
March 03, 2022
0
Tags