హైదరాబాద్ లోని సైదాబాద్కు చెందిన శ్రీరాముల శ్రావణ్కుమార్ (32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్పేట్లోని లక్ష్మీదుర్గ కాలనీలో స్థిరపడ్డాడు. 2019లో జనగామకు చెందిన రవళి(26)తో అతడికి వివాహమైంది. వారికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో రవళి భర్తతో గొడవపడి కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రావణ్కుమార్ మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. అప్పులు పెరగడంతో లక్ష్మీదుర్గ కాలనీలోని ఇల్లు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న రవళి అందులో తనకూ వాటా ఉందని, వాటా తేలే వరకూ ఇల్లు అమ్మొద్దని పేర్కొంటూ లీగల్ నోటీసు పంపించింది. దాంతో మనస్తాపం చెందిన శ్రావణ్కుమార్ గురువారం రాత్రి మద్యం తాగి కాలనీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. తన చావుకు భార్య, అత్తింటి వారే కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడని, అతడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి చెప్పారు.
భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య
January 22, 2022
0
Tags