కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Telugu Lo Computer
0


తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు నేడు శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఎంపీ, సీఎం కెసిఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ సాధించారు. ఈ సెగ్మెంట్ లో మొత్తం 824 ఓట్లు ఉండగా కవితకు 728 ఓట్లు వొచ్చాయి. బీజేపీ కి కేవలం 56 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 29 ఓట్లు దక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికైన కవిత, దామోదర్ రెడ్డి ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, ఫారూఖ్ హుస్సేన్, భానుప్రసాదరావు, ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎల్.రమణ, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)