మధ్యాహ్నభోజనం బదులు గురువారం ఇడ్లీ, సాంబార్!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. వారంలో గురువారం నాడు మధ్యాహ్న భోజనానికి బదులు ఇడ్లీ, సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. మండలంలోని చిర్రావూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రకారం ఇడ్లీ, సాంబార్ వడ్డించనున్నారు. తాడేపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐదు ఇడ్లీలు ఇవ్వనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో మధ్యాహ్న భోజనం పథకంలో పాత మెనూ ప్రకారం ప్రతి గురువారం కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అధికారులు అందజేసేవారు.


Post a Comment

0Comments

Post a Comment (0)