ఖమ్మం జిల్లాలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం

Telugu Lo Computer
0


టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న 54 అడుగుల విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న ఖమ్మం జిల్లా లకారం చెరువులో దీనిని ఆవిష్కరించనున్నారు. రూ. 2.3 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ అభిమానులు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో దీనిని తయారుచేస్తుండగా, పనులు తుది దశకు చేరుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)