తగ్గిన సిమెంట్‌ ధరలు

Telugu Lo Computer
0


సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్‌ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు, తమిళనాడులో రూ.20 దాకా తగ్గింది.  కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు తగ్గింది. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. తమిళనాడులో ఒక టాప్‌ బ్రాండ్‌ సిమెంటు ధర రూ.400 దిగువకు, కర్ణాటక, కేరళల్లోనూ బస్తా ధర రూ.360-400 నుంచి రూ.340-380కి చేరినట్లు డీలర్లు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)