గుండాల తహసీల్దార్‌ ఉద్యోగిని పట్ల అనుచి ప్రవర్తన

Telugu Lo Computer
0


ఉద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన యాదాద్రి జిల్లా గుండాల తహసీల్దార్‌ ఉల్ఫాల దయాకర్‌రెడ్డిని సీసీఎల్‌ఎ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 8 న సదరు ఉద్యోగిని కలెక్టర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో పనులు పెండింగ్‌లో లేకపోయినప్పటికీ రాత్రి, పగలు తేడా లేకుండా మూడు, నాలుగు నెలల నుంచి గుండాల తహసీల్దారు దయాకర్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతూ, దూషిస్తున్నారని అతని ప్రవర్తనలో మార్పు కోసం ఎదురుచూసి విసిగిపోయి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పారు. ఉద్యోగి ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ నిందితుడిని హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఎ కార్యాలయానికి సరెండర్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)