రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి

Telugu Lo Computer
0


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రామోజీ ఫిలింసిటీలో గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. కృష్ణంరాజు కటౌట్ పైకి అభిమానులు ఎక్కి హంగామా సృష్టించారు. ఆ సమయంలో కటౌట్ కింద పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరోవైపు అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)