ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా పోటీ చేయబోయే ముగ్గురు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, శ్రీకాకుళం జిల్లాకుచెందిన పాలవలస విక్రాంత్ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఎన్నికల తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ముమ్మర కసరత్తు చేసింది. మొత్తం 14 స్థానాలు ఖాళీలు ఉండగా, ఆశావాహుల సంఖ్య మాత్రం పెద్ద సంఖ్యలో ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సామాాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలోనే ముగ్గురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గోవిందరెడ్డి, ఇషాక్ భాషా, విక్రాంత్కు అవకాాశం కల్పించింది. జిల్లాల వారీగా నేతల వడబోతను చేపట్టిన అనంతరం.. వైసీపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మూడు పేర్లు ప్రకటన
November 10, 2021
0