విజయ్‌ భాస్కర్‌రెడ్డిది హత్యేనా?

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ లోని తిరుమలగిరి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి కారులో మృతదేహంగా కనిపించిన విజయ్‌ భాస్కర్‌ రెడ్డిది హత్యేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అల్వాల్‌కు చెందిన విజయ్‌ భాస్కర్‌రెడ్డి ఫ్లాట్‌ రిజిస్ర్టేషన్‌ నిమిత్తం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బేగంపేట్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్ కు బయలుదేరినట్లు అతడి బాబాయ్‌ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆ తర్వాత అతని మృతి గురించి సమాచారం వచ్చింది. విజయ్‌ భాస్కర్‌రెడ్డిది హత్యేనని బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుమలగిరి నుంచి టీచర్స్‌ కాలనీ వైపుగా కారు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.10 లక్షలు తీసుకుని బయలుదేరినట్లు బంధువులు తెలిపారు. ఆయన మృతి చెందినట్లు రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు తెలిపారన్నారు. విజయ్‌ భాస్కర్‌ రెడ్డికి, సమీప బంధువు ఒకరితో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)