పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తాళ్లతూర్పు గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ (30) బతుకుదెరువు కోసం 10 సంవత్సరాల క్రితం భార్య దేవిదుర్గతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. దుర్గా ప్రసాద్ దినసరి కూలీ. భార్య హౌస్ కీపర్. సంవత్సరం కాలంగా రోజూ మద్యం తాగి ఇంటికివచ్చి భార్యతో గొడవపడుతున్నాడు. మద్యం మానేయకపోతే పుట్టింటికి వెళతానని చెప్పి, భార్య పనికి వెళ్లిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుర్గాప్రసాద్ తలుపులకు గడియ వేసి వైరుతో ఇనుపరాడ్డుకు ఉరేసుకున్నాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన భార్య దేవిదుర్గా తలుపులు తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. గమనించిన దుర్గాప్రసాద్ సోదరుడు శివశంకర్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా వైరుతో ఉరేసుకుని కిందపడి ఉన్నాడు. స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. భార్య పిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ ఎస్ఐ కోటేశ్వర్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య మందలించినందుకు......!
November 09, 2021
0
Tags