తృటిలో పెను ప్రమాదం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహ ఓ కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద కొత్త కారు టైరు పేలి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న జనాలు, వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. అయితే ఒక్కసారిగా కారు దూసుకురావడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, ఆరు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం గురించి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)