ఓ మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు పేర్కొంది. మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ నుంచి మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేసి, తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం కేసుపై మహిళా ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది.
లంచం డిమాండ్ చేసిన మహిళా ఎస్ఐ అరెస్ట్
أكتوبر 10, 2021
0