కొడుకుల వేధింపులు తట్టుకోలేక.....!

Telugu Lo Computer
0

 


హైదరాబాద్ , వనస్థలిపురంలో ఉండే మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి పెళ్లిళ్లు చేశారు. ఇద్దరికీ కోట్ల రూపాయల విలువైన ఆస్తిపాస్తులను ఇచ్చారు. పన్నెండెకరాల భూమిని సమానంగా పంచి ఇచ్చారు. అయినా, కొడుకుల ఆశ తీరలేదు. మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి ఉంటున్న ఇంటిపై వాళ్ల కన్ను పడింది. ఆ ఇంటికి కూడా అమ్మేసుకుని వాటాలు పంచేసుకోవాలనుకున్నారు. అంతే, తల్లిదండ్రులను టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. దాంతో, తాము చచ్చాక మీకే వస్తుంది, అప్పటివరకు ఆగండి అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. అయినా, మాట వినని కొడుకులు… కనిపెంచిన తల్లిదండ్రులకే అన్నం పెట్టడం మానేశారు. వృద్ధాప్యంలో ఉన్నారనే కనికరం లేకుండా పని చేయిస్తూ కసాయిల్లా ప్రవర్తించేవారు. చివరికి, ఇంటి కోసం కేసులు కూడా పెట్టి వేధించారు. పెన్షన్ డబ్బులను కూడా లాక్కునేవారు. దాంతో, విసిగిపోయిన మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి దంపతులు… ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)