మదర్ థెరీసా

Telugu Lo Computer
0


మదర్ థెరీసా ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ  పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో , ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.

మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది, పేద ప్రజల, నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది.

ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి, విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది. ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్), బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.

ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు (గొంక్శే అనే పదానికి " అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్ధం) 1910 ఆగష్టు 26, ఉస్కుబ్, ఒట్టోమన్ సామ్రాజ్యం (ఇప్పుడు స్కోప్జే, ఉత్తర మేసిడోనియా)యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27,ను తన నిజమైన జన్మదినంగా భావించే వారు. ఆమె అల్బేనియాలోని స్కోదర్ చెందిన నికోల్లే, డ్రాన బొజాక్షిహ్యు దంపతుల ఆఖరి సంతానం. ఈమె తండ్రి అల్బేనియా రాజకీయాలలో పాల్గొనేవారు. 1919 లో, ఆగ్నెస్ కు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నపుడు, స్కోప్జేని అల్బేనియా నుండి తొలగించే నిర్ణయం తీసుకున్న ఒక రాజకీయ సమావేశం తరువాత ఆమె తండ్రి జబ్బుపడి మరణించారు. ఆ సమయంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో నున్న. ఆమె 1910 ఆగష్టు 26, న జన్మించి నప్పటికీ తానూ మతం స్వీకరించిన 1910 ఆగష్టు 27, న తన "నిజమైన పుట్టిన రోజు"గా భావించారు. కొన్ని వర్గాలు ఆమె తండ్రి చనిపోయే నాటికి ఆమె వయస్సు 10 సంవత్సరాలని తెలిపినప్పటికీ, ఆమె సోదరుని ఇంటర్వ్యూద్వారా, వాటికన్ పత్రాలద్వారా ఆమెవయస్సు ఎనిమిది సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తూంది. ఆమె తండ్రి మరణం తరువాత తల్లి ఆమెను రోమన్ కథొలిక్ గా పెంచారు.జోన్ గ్రాఫ్ఫ్ క్లూకాస్ చే రచింపబడిన జీవితచరిత్ర ప్రకారం ఆమె తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథలపట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కాని, సోదరిని కానీ కలవలేదు.

ప్రారంభంలో ఆమె సిస్టర్స్ అఫ్ లోరెటో భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి ఐర్లాండ్ లోని రాట్ ఫారన్హమ్ గలలోరెటో అబ్బీకి వెళ్లారు.1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు. 1931 మే 24 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసారు.మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు. 1937 మే 14 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసారు.

పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందించినప్పటికీ, కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది.

 1943 లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను, మరణాలను తీసుకు వచ్చింది, ఆగష్టు 1946 లో ఏర్పడిన హిందూ/ముస్లిం హింస నగరాన్ని నిరాశ, భయాందోళనలకు గురిచేసింది.

మిషనరీస్ అఫ్ ఛారిటీ సాంప్రదాయక చీరకట్టుతో.

1946 సెప్టెంబర్ 10,లో తెరెసా తన సాంవత్సరిక విరామంలో భాగంగా కలకత్తానుండి డార్జిలింగ్ లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నపుడు తాను "పిలుపులో పిలుపు"గా పొందిన అనుభవాన్ని గుంరించి తెలియ చేసారు. నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివశిస్తూ వారికి సేవ చేయాలి.ఇది ఒక ఆజ్ఞ.దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే." 1948 లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు.ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు; అటు వెంటనే అనాథల, అన్నార్తుల అవసరాలను తీర్చ సాగేరు. తొందరలోనే ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేసాయి.

తెరెసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు.ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం, ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది.ఈ ప్రారంభ నెలలలో ఒంటరి తనము, ఆశ్రమ జీవితంలోని సౌకర్యాలకు మరలి పోవాలనే ప్రేరేపణ వంటి సంశయాలను కలిగి ఉన్నారు.ఈ విషయాలను తన డైరీలో వ్రాసుకున్నారు:

“ 

మా దేవుడు నన్ను పేదరికం అనే శిలువతో కప్పబడిన స్వేచ్ఛా సన్యాసినిగా వుండమంటున్నాడు. నేను ఈరోజు మంచి పాఠం నేర్చుకున్నాను. పేదల బీదరికం వారికి చాలా కష్టంగా వుండివుండాలి. ఒక ఇల్లు కొరకు వెతుకుతూ నా కాళ్లు చేతులు నొప్పిపుట్టేంతవరకూ నడిచాను. పేదవారు ఇంటికొరకు, ఆహారం , ఆరోగ్యం కొరకు వెతుకుతూ శరీరంలోను , ఆత్మలోను ఎంత బాధపడుతున్నారోనని అనుకున్నాను. అప్పుడు లోరెటో లో నున్న సుఖప్రధమైన జీవితం నన్ను లాలసకు గురిచేసింది. నీవు ఒక్క మాటంటే చాలు మరల ఆ పాత జీవితం మరలం నీదవుతుందని నన్ను లోంగదీసుకోనే గొంతు చెప్తున్నది. నా స్వేచ్ఛమైన మనస్సుతో దేవుడా, నీపై ప్రేమతో, నేను ఇక్కడే వుంటాను.నాగురించి నీ పవిత్ర ఇష్టాన్ని నెరవేరుస్తాను. నేను ఒక కన్నీటిబొట్టు కూడా రానివ్వలేదు.

1950 అక్టోబరు 7 ఆమె వాటికన్ అనుమతితో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు అదే తరువాత మిషనరీస్ అఫ్ ఛారిటీగా రూపొందింది. ఆమె మాటలలో "ఆకలిగొన్న వారల, దిగంబరుల, నిరాశ్రయుల, కుంటి వారల,కుష్టు వ్యాధి గ్రస్తుల, అందరూ త్యజించారని భావించే వారల, ప్రేమించబడని వారల, సమాజంచే నిరాకరింపబడిన వారల, సమాజానికి భారమైన వారల , అందరిచే విసర్జింపబడిన వారల "ను జాగ్రత్తగా చూడడమే ఈ సంఘం యొక్క కర్తవ్యం. ఇది కలకత్తాలో స్వల్ప స్థాయిలో 13 మంది సభ్యులతో మొదలైంది;నేడు ఇది 4,000 కు పైగా సన్యాసినులను కలిగి అనాథ శరణాలయాలు, ఎయిడ్స్ ధర్మశాలలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ, శరణార్ధులకు, అంధులకు, అంగవికలురకు, వృద్ధులకు, మద్యపాన గ్రస్తులకు, బీదవారికి , నిరాశ్రయులకు, వరద బాధితులకు, అంటువ్యాధులు , కరువు బాధితులకు సహాయం చేస్తోంది.

కోల్కతాలో నిర్మల్ హృదయ్ (2005)

1952 లో మదర్ థెరీసా కలకత్తా నగరంచే ఇవ్వబడిన స్థలంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు.భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడినహిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు.ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ( కాళీఘాట్ హోం ఫర్ ది డయింగ్) (నిర్మల్ హృదయ్) గా పేరు పెట్టారు .ఈ నిలయానికి తీసుకురాబడిన వారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మల ననుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. ముస్లింలు ఖురాన్ చదివేవారు, హిందువులకు గంగా జలం అందించేవారు, కాథలిక్స్ కు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరుపబడేవి.ఆమె మాటలలో అది "ఒక అందమైన చావు", "జంతువులలా బ్రతికిన మనుష్యులకు దేవతల వంటి చావును కల్పించడం-ప్రేమతో , అక్కరతో." ఆ వెంటనే మదర్ థెరీసా సాధారణంగా కుష్టు వ్యాధిగా పిలువబడే హాన్సెన్ వ్యాధి గ్రస్తులకు శాంతి నగర్ అనే పేరుతో ధర్మశాలను ఏర్పాటు చేసారు. మిషనరీస్ అఫ్ ఛారిటీ కుష్టు వ్యాధిని అధిగమించుట కొరకు కలకత్తా నగరవ్యాప్తంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి, వైద్యాన్ని, కట్టు కట్టడానికి అవసరమైన వస్త్రాలను, ఆహారాన్ని అందచేసింది.

మిషనరీస్ అఫ్ ఛారిటీఅధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసింది, మదర్ థెరీసా వారికి ఆశ్రయాన్ని కల్పించాలని భావించారు. 1955 లో ఆమె అనాథలకూ, నిరాశ్రయులైన యువకుల కొరకు, పరిశుద్ధ హృదయ బాలల ఆశ్రయమైన నిర్మల శిశు భవన్ ను ప్రారంభించారు.

ఈ సంస్థ త్వరలోనే అనేకమంది కొత్త వ్యక్తులను, విరాళాలను ఆకర్షించింది, 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను, అనాథ శరణాలయాలను, కుష్టు వ్యాధి గ్రస్తులకేంద్రాలను ఏర్పాటు చేసింది.మదర్ థెరీసా తన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.భారతదేశం వెలుపల వీరి మొదటి ఆశ్రయం వెనిజులాలో 1965 లో ఐదుగురు సిస్టర్స్ తో మొదలైంది. తరువాత 1968 లో రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలలో ; 1970 లలో ఆసియా, ఆఫ్రికా, యూరోప్లలో అనేక దేశాలలో, యునైటెడ్ స్టేట్స్లో అనేక ఆశ్రయాలను, ఫౌండేషన్లను స్థాపించింది.

ఆమె తాత్త్వికత, ఆచరణలు కొంత విమర్శకు గురిఅయ్యాయి. మదర్ థెరీసా ప్రజలను కేవలం బ్రతికి ఉంచేందుకు పరిమితమయ్యారు కాని వారి దారిద్ర్యాన్ని సమూలంగా తొలగించేందుకు ప్రయత్నించలేదని డేవిడ్ స్కాట్ వ్రాసారు. బాధితుల పట్ల ఆమె దృక్పధం పట్ల కూడా ఆమె విమర్శలను ఎదుర్కొన్నారు.అల్బెర్ట రిపోర్ట్ లోని ఒక వ్యాసం, ఆమె, బాధ అనేది ప్రజలను క్రీస్తు సమీపానికి చేరుస్తుందని భావించారని తెలియచేసింది. అంత్యదశలో ఉన్న రోగగ్రస్తులకు హోమ్ ఫర్ డయింగ్ లో అందించే సేవలు వైద్య పత్రికారంగ విమర్శలకు గురయ్యాయి, ప్రత్యేకించి ది లాన్సెట్], బ్రిటిష్ మెడికల్ జర్నల్ చర్మము క్రింద ఇచ్చే సూదులను తిరిగి వాడటాన్ని, దయనీయమైన నివాస పరిస్థితులను, రోగులందరికీ చన్నీటి స్నానాలను, సరైన రోగానిర్ధారణకు దోహదం చేయని భౌతికవాద వ్యతిరేక ధోరణిని విమర్శించాయి.

ది మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్ సంస్థను 1963 లోను, ధ్యానపరులైన సిస్టర్ల సంస్థను 1976 లోను స్థాపించబడ్డాయి.సాధారణ కాథలిక్ లు, నాన్ కాథలిక్ లు కో-వర్కర్స్ అఫ్ మదర్ థెరీసాలో నమోదు చేసుకున్నారు. జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్నవారు ది లే మిషనరీస్ అఫ్ ఛారిటీలో చేరారు.2007 నాటికి మిషనరీస్ అఫ్ ఛారిటీ ప్రపంచవ్యాప్తంగా 450 మంది సన్యాసులను, 5,000 మంది సన్యాసినులను కలిగి, 600 శాఖలను నిర్వహిస్తూ, 120 దేశాలలో పాఠశాలలను, ఆశ్రయాలను కలిగి ఉంది.

అంతర్జాతీయ దాతృత్వం

1982 లో బీరూట్ ఆక్రమణకు గురైన సందర్భంలో, మదర్ థెరీసాఇజ్రాయిల్ సైన్యానికి, పాలస్తీనా గెరిల్లాలకు మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు. ఈ యువ రోగులను నాశనం కాబడిన వైద్యశాల నుండి బయటకు తీసుకు రావడానికి ఆమె రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించారు.

1980 లలో తూర్పు యూరోప్ బాహ్య ప్రపంచంలోకి వచ్చినపుడు, అనేక కార్యక్రమాలను ప్రారంభింప చేసి ఆమె తన ప్రయత్నాలను కమ్యూనిస్ట్ దేశాలకు విస్తరించారు.గర్భస్రావం, విడాకుల పట్ల తన అభిప్రాయాలపై వచ్చిన విమర్శలను ఆమె స్థిరంగా ఎదుర్కొని, "ఎవరేమన్నా, చిరునవ్వుతో దానికి అంగీకరించి నీ పనిని నువ్వు చేసుకొని పోవాలి", అని పేర్కొనారు.

మదర్ థెరీసాఇథియోపియాలో ఆకలి బాధితులకు, చెర్నోబిల్లో అణుధార్మికత పీడితులకు,  పీడితులకు, అర్మేనియాలో భూకంప వలన నష్ట పోయిన వారికి సహాయం చేసి ఓదార్చడానికి వెళ్లారు. 1991 లో,మదర్ థెరీసా మొదటిసారి తన మాతృదేశానికి తిరిగి వెళ్లి అల్బేనియా లోని టిరానాలో మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్ హోమ్ ని ప్రారంభించారు.

1996 నాటికి ఆమె 100కు పైగా దేశాలలో 517 శాఖలను నిర్వహించేవారు. ఈ కాలంలో మదర్ థెరీసా యొక్క మిషనరీస్ అఫ్ ఛారిటీ పన్నెండు శాఖల నుండి అనేక వేల శాఖలకు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా కడుబీదల సేవ కొరకు 450 శాఖలను కలిగి ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మిషనరీస్ అఫ్ ఛారిటీ యొక్క మొట్ట మొదటి శాఖను సౌత్ బ్రోంక్స్, న్యూయార్క్లో ప్రారంభించారు; 1984 నాటికి దేశ వ్యాప్తంగా ఈ సంస్థలు 19 కి పెరిగాయి.

విరాళాల ధనాన్ని వెచ్చించడం పలువురి విమర్శలకు గురయ్యింది. క్రిస్తోఫేర్ హిచెన్స్, జర్మన్ పత్రిక స్టెర్న్ (పత్రిక) మదర్ థెరీసా, విరాళాల ధన్నాన్ని పేదరికం తొలగించడానికి లేక ధర్మశాలలలోని పరిస్థితులను మెరగుపరచడానికి కాక కొత్త మఠాలను ఏర్పాటు చేయడానికి మతపరమైన కార్యక్రమాలను పెంచడానికి వెచ్చించారని అన్నారు.

అంతేకాక విరాళాలు సేకరించిన వనరులు కూడా విమర్శించ బడ్డాయి.మదర్ థెరీసా హైతిలోని నిరంకుశ, అవినీతి పరులైన దువలిఎర్ కుటుంబం నుండి విరాళాలను అంగీకరించి వారిని బహిరంగంగా పొగిడారు.కీటింగ్ ఫైవ్ స్కాండల్ గా పేరుపొందిన కేసులో, మోసము, అవినీతి ఆరోపణలతో నిందితుడిగా ఉన్న చార్లెస్ కీటింగ్ నుండి 1.4 మిలియన్ డాలర్ల విరాళాన్ని అంగీకరించి, అరెస్టుకు ముందు, తరువాత కూడా అతనిని బలపరిచారు. లాస్ ఏంజిలిస్ నగర డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ, పాల్ టర్లీ ప్రజల నుండి కీటింగ్ దొంగిలించిన విరాళాల సొమ్మును ప్రజలకు ఇచ్చి వేయవలసినదిగా వ్రాసారు, వారిలో ఒకరు పేద వడ్రంగి.ఆ విరాళాల దానం లెక్కలలో చూపబడలేదు, టర్లీ జవాబు అందుకోలేదు.

కలేట్టే లివేర్మోర్, మిషనరీస్ అఫ్ ఛారిటీ పూవా సభ్యురాలు, తాను సంస్థను విడిచి పెట్టడానికి గల కారణాలను తన పుస్తకం హోప్ ఎండ్యుర్స్: లీవింగ్ మదర్ థెరీసా, లూసింగ్ ఫైత్, అండ్ సెర్చింగ్ ఫర్ మీనింగ్లో వివరించారు. మదర్ థెరీసా మంచితనం, ధైర్యం కలిగియున్న వ్యక్తి ఐనప్పటికీ ఆమె "బాధ వేదాంతము" దోష పూరితమైనదని అన్నారు.మదర్ థెరీసా, తన శిష్యులకు, మతపరమైన ఉపదేశాలకంటే తమ చర్యల ద్వారా క్రీస్తు చరిత్రను వ్యాపింప చేయాలని ఆదేశించినప్పటికీ, సంస్థ లోని కొన్ని పద్ధతులు వీటితో సరిపోలనట్లు లివేర్మోర్ గుర్తించారు.నిబంధనల ప్రకారం కాకుండా వేళ తప్పి సన్యాసినుల సహాయార్ధం వచ్చిన వారికి సహాయాన్ని నిరాకరించడం, వారు బాధపడే రోగాలకు సంబంధించి చికిత్సలో శిక్షణ పొందేందుకు సన్యాసినులను నిరాకరించుట(బలహీనులకు, అమాయకులకు దేవుడు శక్తినిస్తాడనే సమాధానంతో), స్నేహితుల నుండి దూరంగా బదిలీ చేయడం వంటి "అనుచితమైన" శిక్ష లను విధించే వారని ఉదాహరణలు ఇచ్చారు.లౌకిక పరమైన పుస్తకాలను, దినపత్రికలను చదవడాన్ని నిషేధించడం, సమస్యా పరిష్కారానికి స్వంత ఆలోచన లేకుండా విధేయతకు ప్రాముఖ్యత నివ్వడం వంటి వాటితో మిషనరీస్ అఫ్ ఛారిటీ తన సన్యాసినులను "శిశువులను" చేసిందని లివేర్మోర్ పేర్కొనారు.

క్షీణించిన ఆరోగ్యం , మరణం

1983 లో పోప్ జాన్ పాల్ II సందర్శనార్ధం మదర్ థెరీసా, రోమ్ వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. 1989 లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ ను అమర్చారు. 1991 లో మెక్సికోలో న్యుమోనియాతో పోరాడుతున్నపుడు ఆమె మరిన్ని హృదయ సమస్యలను ఎదుర్కున్నారు. మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు.కానీ సంస్థ లోని సన్యాసినులు రహస్య ఎన్నిక ద్వారా ఆమె కొనసాగాలని కోరారు. సంస్థ అధిపతిగా కొనసాగడానికి మదర్ థెరీసా అంగీకరించారు.

ఏప్రిల్ 1996,లో మదర్ థెరీసా క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది.ఆగస్టులో ఆమె మలేరియాతో బాధ పడటంతో పాటు గుండె ఎడమభాగంలోని జఠరిక(గుండె) పనిచేయడం మానివేసింది.ఆమెకు గుండె శస్త్రచికిత్సజరిగింది, కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం వెల్లడైంది. తాను అనారోగ్యం పాలైనపుడు తన వైద్యశాలలలో ఏదో ఒక దానిలో చికిత్స పొందకుండా, కాలిఫోర్నియాలో అన్ని హంగులతో కూడిన వైద్యశాలను ఎంచుకొనడం వివాదాలకు దారితీసింది. మార్చి 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు, 1997 సెప్టెంబర్ 5 న మరణించారు.

మదర్ థెరీసాకు మొదటి సారి హృదయ సంబంధ సమస్యలు ఎదురైనపుడు తాను, ఆమెదెయ్యం యొక్క దాడికి గురైందని భావించి దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆమె అనుమతితో ఒక ఆచార్యుని ఆజ్ఞాపించినట్లు కలకత్తా ఆర్చ్ బిషప్ హెన్రీ సెబాస్టియన్ డి'సౌజా చెప్పారు.

ఆమె చనిపోయే నాటికి మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు వ్యాధి, క్షయ రోగులకు ఆవాసాలు,ఆహారకేంద్రాలు, అనాథ శరణాలయాలు, పాఠశాలలు ఉన్నాయి.ప్రపంచవ్యాప్త గుర్తింపు , ఆదరణ

భారతదేశంలో ఆదరణ

1962 లో పద్మశ్రీ బహూకరించడం ద్వారా శతాబ్ద మూడో భాగంలో అందరికంటే ముందుగా భారతప్రభుత్వం ఆమెను గుర్తించింది.తరువాతి దశాబ్దాలలో వరుసగా ఆమె భారత దేశ అత్యున్నత పురస్కారాలైన అంతర్జాతీయ అవగాహనకు గాను జవహర్లాల్ నెహ్రూఅవార్డును 1972 లోను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1980 లోను అందుకున్నారు.

ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీసు అధికారి ఐన నవీన్ చావ్లా రచించి, 1992 లో ప్రచురించారు.

భారతీయుల అభిప్రాయాలు మదర్ థెరీసాకు పూర్తిగా అనుకూలంగా లేవు.భారతదేశంలో పుట్టి, పెరిగి లండన్లో నివసించిన ఆమె విమర్శకుడు అరూప్ చటర్జీ మాటలలో, "ఆమె జీవిత కాలంలో ఎప్పుడూ ఆమె కలకత్తాలో ప్రముఖ వ్యక్తి కారు".తన స్వంత నగరానికి ఒక వికృతమైన రూపాన్ని వ్యాపింప చేసినదుకు చటర్జీ మదర్ థెరీసాను తప్పు పట్టారు. ఆమెహిందూ హక్కులకు వ్యతిరేకంగా ఉండటం వలన భారత రాజకీయ ప్రపంచంలో ఆమె పాత్ర, ఉనికి నిరసించ బడ్డాయి.భారతీయ జనతా పార్టీ, క్రైస్తవ దళితుల, విషయమై ఆమెతో సంఘర్షించింది, కానీ మరణానంతరం ప్రస్తుతించి అంత్యక్రియలకు దూతను పంపింది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆ సంస్థ కార్యదర్శి గిరిరాజ్ కిషోర్, "ఆమె మొదటి విధి చర్చి, సామాజిక సేవ యాదృచ్చికంగా జరిగింది " అన్నారు, ఆమె క్రైస్తవులకు అనుకూలంగా ఉండటాన్ని, మరణించ బోయేవారికి "రహస్య మతమార్పిడి" చేయడాన్ని తప్పుపట్టారు.ఫ్రంట్ లైన్ అనే భారతీయ పక్ష పత్రిక తన ప్రథమ పుట వ్యాసంలో ఈ ఆరోపణలు "స్పష్టంగా నిరాధారమైనవని" కొట్టి పారేసింది. ఆమె కార్యక్రమాలలో, ప్రత్యేకించి కలకత్తాలో ప్రజాసేవ గురించి వారు గుర్తించలేదని అన్నది". ఈ వ్యాస రచయిత ఆమె "స్వలాభంలేని పరోపకారం", శక్తి, ధైర్యాన్ని ప్రస్తుతించినప్పటికీ, గర్భ స్రావానికి వ్యతి రేకంగా ప్రచారం చేస్తూ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు చెప్పుకోవడాన్ని విమర్శించారు. ఈ మధ్య కాలంలో భారత దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఈ విధంగా ప్రచురించింది, "ఆమె పేద ప్రజల పరిస్థితుల ఉపశమనం కొరకు ఏమైనా చేసారా లేక ఒక నైతిక భావపరమైన కారణం కొరకు జబ్బుపడిన , మరణించిన వారికి సేవలు కల్పించారో శోధించాలని రోమ్ ని అడగటం జరిగింది."

సెప్టెంబర్, 1997 లో ఆమె అంత్యక్రియలకు ముందు మదర్ థెరీసా భౌతిక కాయాన్ని ఒక వారం రోజులపాటు సెయింట్ థామస్, కోల్‌కతాలో ఉంచడం జరిగింది. భారతదేశంలో అన్ని మతాల ప్రజలకు ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతగా ప్రభుత్వం ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)