వింత వింత పన్నులు...!

Telugu Lo Computer
0


మన దేశంలో ఒకే పన్ను అమలవుతోంది. అదే జీఎస్టీ.. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు, సేవల తయారీ, అమ్మకం, వినియోగదారులపై విధించనున్న సమగ్రమైన పరోక్ష పన్ను. ఈ పద్ధతిలో జీఎస్టీ-నమోదిత వ్యాపారాలు తమ వాణిజ్య వ్యవహారాల్లో కొనుగోలు చేసే సాధారణ వస్తువులు, సేవలపై జీఎస్టీ విలువపై పన్ను మినహాయింపు పొందవచ్చు. వస్తువులు, సేవలపై పన్ను విధించే నిర్వహణ బాధ్యత సాధారణ ఏకైక అధికారి వద్ద ఉంటుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పన్ను విధిస్తారు. అది వారి ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ, కొన్ని పన్నులు మాత్రం వింతగానూ ఉంటాయి. కొందరు రాజుల చేసిన పనులూ వింతగానే ఉంటాయి. అంతేకాదు అవి చరిత్రలోనూ నిలిచిపోయాయి. ఒకసారి ఆ వింతలేంటో తెలుసుకుందాం..

ఫీజు కింద రాళ్లు..

దూరానికీ పన్నుకు ముడిపెట్టిన చరిత్ర చైనాలోని 'చౌ' వంశీయులది. వారి హయాంలో రాజధానికి చేరువలో ఉన్న పొలాలకు చెందిన రైతుల పై 5 శాతం పన్ను విధించేవారు. పొలాల దూరాన్ని బట్టి రైతులపై 25 శాతం పన్ను విధించేవారు. ఈజిప్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేవి 'పిరమిడ్' లు. 'పిరమిడ్' నిర్మించడానికి ఫారో చక్రవర్తి వద్ద ఖజానాలో డబ్బులు లేకుంటే .. ఆయన ఏకంగా తన కుమార్తెను వ్యభిచారంలోకి దించాడట. ఆమె తనతో గడిపే విటుల నుంచి డబ్బుతో పాటు పిరమిడ్ నిర్మాణానికి కావాల్సిన రాళ్ళనూ ఫీజు కింద డిమాండ్ చేసేదట. తదనంతర కాలంలో ఆమె మరణించిన తరువాత ఈ రాళ్లతోనే కప్పెట్టేశారట ..! ఇంతకీ ఈ పిరమిడ్ కోసం ఎన్ని రాళ్లు వాడారో తెలుసా? 20 వేల రాళ్లు. జర్మనీ సర్కార్ 2004 లో కోట పన్నును అమల్లోకి తీసుకు వచ్చింది. దీని ప్రకారం ఫుల్ టైం సెక్స్ వర్కర్లు స్థానిక సంస్థలకు ప్రతినెలా 150 యూరోలు చెల్లించాలట. పార్ట్ టైం సెక్స్ వర్కర్లు వారి పని దినాలను బట్టి 6 యురోలు చెల్లించేవారట.

డెత్​ ట్యాక్స్​..

చచ్చిన తరువాత కూడా పన్ను కట్టాల్సిందే అంటోది సియాటిన్. సియాటి డేటర్లోని కింగ్ కౌంటీలో మరణంపైనా పన్ను చెల్లించాల్సిందే అని చెబుతూ ఒక చట్టాన్ని అమలు చేయడాన్ని మొదలుపెట్టారు. మృతుని బంధువులు వైద్య పరీక్ష అధికారికి 50 డాలర్లు చెల్లించాలి. అప్పుడు మాత్రమే మృతదేహాన్ని తగలబెట్టడానికి, ఖననం చేయడానికి అనుమతి లభిస్తుంది. దీన్ని స్థానికులు డెత్ టాక్స్ అని పిలుస్తారు. క్రీ.శ. 15 వ శతాబ్దం చివరి దశకంలో జపాన్ చక్రవర్తి హిడేయోషి రైతులను పీల్చి పిప్పి చేశాడు. రైతులు పండించిన పంటలో మూడింట రెండొంతుల పన్ను కట్టాల్సిందే అని హుకుం జారీ చేశారు. పంటల్లో వరి పంటపై ఉక్కుపాదం మోపాడు. ఏకంగా వరి ఉత్పత్తులపై 67 శాతం పన్నును వసూలు చేసేవాడు.  1705 లో, రష్యన్ చక్రవర్తి పీటర్ ది గ్రేట్ పశ్చిమ యూరోప్ పురుషులు క్లీన్​గా షేవ్ చేసుకొని అందంగా కనిపించాలనే ఉద్దేశంతో గడ్డాలపై పన్ను విధించారు.

మనదేశంలోనూ రాజులు వింత పన్నులు విధించారు. కేరళలో ట్రావెన్‌కోర్ వంశీయులు రొమ్ము పన్ను విధించారు. క్రీ.శ. 1696 లో ఇంగ్లాండ్‌లో మూడవ విలియం 'కిటికీ పన్ను'ను ప్రవేశపెట్టారు. ఇంటికి ఉన్న కిటికీల సంఖ్య విండో టాక్స్ వసూలు చేసేవారు. పది, తరువాత కిటికీలు కలిగి ఉన్న ఇళ్లకు పది షిల్లింగ్‌లు చెల్లించాల్సి వస్తుంది. అనేక పన్ను కట్టలేక ఇటుకలతో కిటికీలను మూసేసుకునేవారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)