త్వరలో హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ లాంఛ్

Telugu Lo Computer
0



దక్షిణ కొరియా కారు తయారీ కంపెనీ హ్యుందాయ్ వచ్చేవారంలో తన ఐ20 ఎన్ లైన్ ఇండియా లాంఛ్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఐ20 ఎన్ లైన్ వివరాలను వెల్లడించిన కంపెనీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. సెప్టెంబర్ 2న ఈ వాహనం ధరను హ్యందాయ్ వెల్లడించనుంది. ఐ20 స్పోర్ట్ వెర్షన్ కారుగా ఐ20 ఎన్‌లైన్ భారత్‌లో తొలి ఎన్ లైన్ కారుగా మార్కెట్‌లోకి రానుంది. ఐ20 టర్బో ఇంజన్‌తో రానున్న ఎన్‌లైన్ పలు కాస్మెటిక్ మార్పులతో కస్టమర్ల ముందుకు రానుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మెరుగైన సామర్ధ్యంతో పలు మెకానికల్ మార్పులను ఐ20 ఎన్ లైన్‌లో కంపెనీ చేపట్టింది. ఐ20 ఎన్ లైన్ స్పోర్టియర్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు మెరుగైన ఫ్రంట్ బాడీ కంట్రోల్‌, పిచ్ కంట్రోల్‌, అద్భుతమైన స్టీరింగ్ రెస్పాన్స్‌తో వాహనదారులను ఆకట్టుకోనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)