బొగ్గుల కుంపటి ప్రాణాన్ని బలితీసింది !

Telugu Lo Computer
0

 

తమిళనాడు లోని  చెన్నై నగర శివార్లలోని పమ్మల్‌, తిరువళ్లూరు నగర్‌లో పుష్పలక్ష్మి, సొక్కలింగం దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో వాటిని తరమడానికి ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టారు. అందులో నూనె వేసి పొగ పెట్టారు. అనంతరం నిద్రపోయారు. అయితే, వారు ఉన్న గదిలో ఏసీ కూడా ఉండటంతో పొగ బాగా కమ్ముకుంది. దాంతో వారంతా నిద్రలోనే ప్రాణాలు వదిలారు.  స్థానికులు కిటికీలోంచి చూడగా.. అందరూ పడుకుని ఉన్నారు. ఎంత లేపినా లేవకపోవడంతో.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. గది అంతా ఒక రకమైన వాసన రావడంతో వారిని పరిశీలించారు. పుష్పలక్ష్మిని చూడగా, ఆవిడ అప్పటికే మృతి చెందింది. భర్త సొక్కలింగంతో పాటు.. కూతురు, కొడుకు ఊపిరి ఆడుతున్నప్పటికీ స్పృహలోకి రావడం లేదు. దాంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)