ప్రియా మాలిక్ కు పసిడి పతకం

Telugu Lo Computer
0


బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీలలో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపి యన్‌షిప్‌లో ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిప్టింగ్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన మరుసటి రోజే..ప్రియా మాలిక్ ప్రపంచ స్థాయి టైటిల్ నెగ్గడం నిజంగా భారత క్రీడాభిమానులను సంతోషంలోముంచెత్తే విషయం.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)