పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

Telugu Lo Computer
0


ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల చెందిన నిరుపేద విద్యార్ధులకు తన తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ఇస్తామని ప్రకటించాడు. వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెంది ఉండి,  మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు10 రోజుల్లో తమ వివరాలను scholarships@sonusood.me మెయిల్‌కు పంపాలన్నారు. 

గడిచిన కొద్దినెలల్లో నిరుపేద కుటుంబాలు తమ పిల్లల చదువు కోసం ఎలా కష్టపడుతున్నారో నేను చూశాను. కొంతమందికి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి ఫోన్లు లేవు, మరికొందరికి ఫీజు చెల్లించడానికి డబ్బు లేదు. కాబట్టి, నా తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో స్కాలర్‌షిప్‌లను అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. మోగా (పంజాబ్)లో ఆమె ఎంతోమంది పిల్లలకు ఉచితంగా పాఠాలు బోధించేవారు. ఆ ప్రేరణతోనే ఆమె చేసిన మంచి పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఇదే మంచి సమయం అని భావిస్తున్నట్లు సోనూసూద్ తెలిపారు. 

Tags

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)