మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 17 November 2023

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస


ధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం పోలింగ్‌ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోరెనా జిల్లాలోని మిర్ఘన్‌లో ఈ సంఘటన జరిగింది. డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 147, 148 వద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2533 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 45 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment