నాడు మన్మోహన్ సింగ్ - నేడు మల్లికార్జున ఖర్గే ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 8 November 2023

నాడు మన్మోహన్ సింగ్ - నేడు మల్లికార్జున ఖర్గే !


ధ్యప్రదేశ్ లోని దామోహ్‌లో నిర్వహించి ఎన్నికల ర్యాలీలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదేనని, 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, ప్రస్తుత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్లు చెప్పకుండానే ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ''2014కి ముందు దేశ ప్రజలు పదేళ్ల పాటు పని చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పరిస్థితిని చూడండి. దేశ ప్రధాని ఏం చేస్తున్నారో, ఏం చెబుతున్నారో మీకు తెలిసి ఉండాలి. కానీ ఆయన ఏ పని చేయరు. ఎందుకంటే అంతా రిమోట్ కంట్రోల్ ద్వారా జరిగింది'' అని మోడీ అన్నారు. “ఆ రోజుల్లో ప్రధాని రిమోట్ కంట్రోల్‌లో నడుచుకున్నారు. ఈ రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రిమోట్ కంట్రోల్‌లో నడుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా సీనియర్ నాయకుడు. మంచి మనిషి కూడా. నాకు మంచి మిత్రుడు. కానీ ఈరోజు ఆయన పరిస్థితి ఏమీ చేయలేని స్థితిలో తయారైంది. ఆయనను నామమాత్రంగా ఉంచారు. కానీ కొన్నిసార్లు రిమోట్ ఛార్జింగ్ అయిపోతే ఆయన నోటి నుంచి కొన్ని మంచి విషయాలు బయటకు వస్తాయి'' అని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment