సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 3 November 2023

సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ !


సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌జిఈఎఫ్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. టిఎన్జీఓ కేంద్ర సంఘం, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఈఎఫ్) పిలుపు మేరకు శుక్రవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిపిన 'చేతన్‌ ర్యాలీ'లో టిఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో 100 మంది టిఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఎన్జీఓ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేనీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పిఎఫ్‌ఆర్‌డిఏ చట్టాన్ని రద్దు చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వాలకు నుంచి ఇప్పటివరకు జమ అయిన సొమ్మును తిరిగి రాష్ట్రాలకు ఇప్పించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, ఉద్యోగుల పెండింగ్ డిమాండ్‌లను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఉద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ప్రధానంగా నూతన పెన్షన్ విధానం రద్దు, ఇన్‌కంట్యాక్స్ పరిమితి పెంపు, కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కస్తూరి వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షుడు, సత్యనారాయణ గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు, ఆర్. శ్రీనివాస రావు, కోశాధికారి, కామారెడ్డి అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సాయిలు, మెదక్ అధ్యక్షుడు నరేందర్, హనుమకొండ అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాజేందర్, సోమన్న, జనగాం ఖాజా షరీఫ్, శ్రీనివాస్, మహబూ బాబాద్ అధ్యక్షుడు శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment