డిసెంబర్ నాటికి పట్టాలెక్కనున్న 'వందే సాధారణ్' రైళ్లు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 30 October 2023

డిసెంబర్ నాటికి పట్టాలెక్కనున్న 'వందే సాధారణ్' రైళ్లు !


డిసెంబర్ నాటికల్లా 'వందే సాధారణ్' రైళ్లని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. సామాన్య ప్రజలకు సేవలందించే లక్ష్యంతో ఈ రైళ్లను తీసుకొస్తున్నారు. నాన్-ఏసీ స్లీపర్, నాన్-ఏసీ జనరల్ తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈ 'వందే సాధారణ్' రైళ్లను తయారు చేస్తున్నారు. స్లీపర్ వెర్షన్ దేశవ్యాప్తంగా 30 రూట్స్‌లో నడవనున్నాయి. ఈ నాన్-ఏసీ రైళ్లు పుష్-పుల్ మోడ్‌లో పని చేస్తాయి. ప్రతి చివర లోకోమోటివ్ ఉన్నా, లేకున్నాఇరువైపుల నుండి రేక్‌లను నడపడానికి వీలుంది. భారతీయ రైల్వే తన ఉత్పత్తి యూనిట్లలో 102 వందే భారత్ రేక్‌ల ఉత్పత్తి ప్రణాళికను విడుదల చేసింది. వీటిలో 75 రేక్‌లు చైర్ కార్ వెర్షన్‌గా, మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా ప్లాన్ చేయబడ్డాయి. ఈ రైళ్లలో ప్రతి కోచ్‌లో బయో వాక్యూమ్ టాయిలెట్లు, ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాదిరిగానే వందే సాధరన్ రైలులో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉంటుంది. టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment