ఛత్తీస్‌గఢ్‌లో భాజపా కార్యకర్త హత్య - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 21 October 2023

ఛత్తీస్‌గఢ్‌లో భాజపా కార్యకర్త హత్య

త్తీస్‌గఢ్‌ లో భాజపా కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన మోహ్లా మన్‌పుర్‌ అంబగఢ్‌ చౌకీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఔందీ గ్రామానికి చెందిన భాజపా కార్యకర్త బిర్జు తారమ్ (60) సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడికి దిగారు. తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తారమ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ముందు ఈ హత్య జరగడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అరుణ్ సావో స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. భాజపా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు భాజపా నేతలు భయపడరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గద్దె దించుతామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ హత్య చోటు చేసుకోవడం తొలిసారి కాదు. గతంలో బీజాపుర్‌, బస్తర్‌ డివిజన్‌, నారాయణపుర్‌ జిల్లాల్లో భాజపా నేతలు హత్యకు గురయ్యారు. 

No comments:

Post a Comment