పాకిస్తాన్‌ జట్టుకు భారీ జరిమానా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 29 October 2023

పాకిస్తాన్‌ జట్టుకు భారీ జరిమానా !


వన్డే వరల్డ్‌కప్‌-2023లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి పాకిస్తాన్‌ జట్టుకు భారీ జరిమానా విధించింది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా బాబర్‌ ఆజం బృందం శుక్రవారం సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో పాక్‌ విధించిన లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా టాపార్డర్‌ విఫలం కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ 91 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, అతడు అవుటైన తర్వాత ఆఖరి వరకు హైడ్రామా నెలకొంది. గెలుపునకు చేరువగా వచ్చిన సఫారీలు 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడింది.


No comments:

Post a Comment