ఉత్తరప్రదేశ్ లో వర్ష బీభత్సానికి 19 మంది బలి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 11 September 2023

ఉత్తరప్రదేశ్ లో వర్ష బీభత్సానికి 19 మంది బలి


త్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.దీంతో వర్షాల కారణంగా 19 మంది చనిపోయారు. అటు ఉత్తరాఖండ్‌లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. అటు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. మరోవైపు రానున్న కొద్ది రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలుపుతుంది. అంతేకాకుండా పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. సోమవారం వాతావరణ శాఖ తూర్పు ఉత్తరప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబరు 11న కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల భారీ నీటి ఎద్దడి నెలకొంది. భారీ వర్షం ప్రభావంతో బారాబంకి రైల్వే స్టేషన్‌లో కూడా రైల్వే ట్రాక్‌ నీటితో నిండిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా 11 మంది మరణించారని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ తెలిపారు. కన్నౌజ్ జిల్లా లాల్కియాపూర్ గ్రామంలో వర్షం కారణంగా ఓ ఇల్లు కూలి ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. అంతేకాకుండా భారీ వర్షాలు, నీట మునిగిన ఘటనల్లో హర్దోయ్‌లో నలుగురు, డియోరియా, కాన్పూర్ నగరం, రాంపూర్, సంభాల్ మరియు ఉన్నావ్‌లలో ఒక్కొక్కరు మరణించారు.

No comments:

Post a Comment