రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 September 2023

రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి


క్రెయిన్‌లోని కోస్టియాంటినవ్కా నగర మార్కెట్‌పై రష్యా సేనలు బుధవారం బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి జరపడంతో 17 మంది మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. పలు దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. పౌర ప్రాంతాలపై దాడితో ఉద్దేశపూర్వకంగానే ప్రాణనష్టం కలిగించారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. కీవ్‌ నగరాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సందర్శించిన సమయంలోనే ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్‌ ఎదురుదాడులు నెమ్మదించాయని విమర్శలొస్తున్న వేళ ఆయన పర్యటన చేపట్టారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని చెప్పే రీతిలో దాదాపు 100 కోట్ల డాలర్ల మేర సైనిక సాయాన్ని ఆయన ప్రకటించనున్నారు. జెలెన్‌స్కీతో ఆయన సమావేశమై, రష్యా దాడుల్ని తిప్పికొట్టే చర్యలపైనా, పునర్నిర్మాణ పనులపైనా చర్చించనున్నారు. పోలండ్‌ నుంచి కీవ్‌కు రైల్లో ప్రయాణించిన బ్లింకెన్‌.. అందులోనే డెన్మార్క్‌ ప్రధాని మెట్‌ ఫ్రెడెరిక్సన్‌తో సమావేశమయ్యారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్‌ను బ్లింకెన్‌ సందర్శించడం ఇది నాలుగోసారి. ఈసారి రాత్రిపూట కూడా బస చేయనున్నారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో రష్యాను ఎలా ఎదుర్కోవాలో చర్చించి, మద్దతు అందించడంపై ఆయన చర్చించనున్నారు.

No comments:

Post a Comment