ప్రధాని నరేంద్ర మోడీ స్కూలు పిల్లలతో కలిసి రక్షాబంధన్ వేడుకను జరుపుకొన్నారు. ఢిల్లీ పాఠశాలల విద్యార్థినులు బుధవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు.అనంతరం మోడీ వాళ్లతో కొద్ది సేపు ముచ్చటించారు. 'స్కూలు పిల్లలు ఇటీవలి చంద్రయాన్ విజయంపై తమ పాజిటివ్ మనోభావాలను ప్రధానితో పంచుకున్నారు. రాబోయే ఆదిత్య ఎల్1 మిషన్పై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు' అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా పిల్లలు పద్యాలు, పాటలు పాడారు కూడా. వారి ఉచ్చారణకు ముచ్చటపడిన ప్రధాని వారినిప్రజల కోసం ప్రభుత్వ పథకాతో పాటుగా వివిధ అంశాలపైపాటలు రాయాల్సిందిగా కోరారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు, వారి టీచర్లతో కలిసి ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల( ఎన్జిఓలు) ప్రతినిధులు, బృందావన్కు చెందిన వితంతువులు కూడా ఈ సంర్భంగా పాలు పంచుకున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. అంతకు ముందు రాఖీ పండగ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'రక్షాబంధన్ ఓ పవిత్రమైన పండగ. మన దేశ సంస్కృతికి ప్రతి రూపం.ఈ పండుగ ప్రజల జీవితాల్లో బంధాలు, ఆప్యాయత, సామరస్య భావాలను మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నా' అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.
Post Top Ad
adg
Wednesday, 30 August 2023
Home
modi raksha bandhan
National
raksha bandhan
చంద్రయాన్
మోడీ వాళ్లతో కొద్ది సేపు ముచ్చటించారు
స్కూల్ పిల్లలతో ప్రధాని రక్షాబంధన్ వేడుకలు
స్కూల్ పిల్లలతో ప్రధాని రక్షాబంధన్ వేడుకలు
Tags
# modi raksha bandhan
# National
# raksha bandhan
# చంద్రయాన్
# మోడీ వాళ్లతో కొద్ది సేపు ముచ్చటించారు
About Telugu Lo Computer
మోడీ వాళ్లతో కొద్ది సేపు ముచ్చటించారు
Tags
modi raksha bandhan,
National,
raksha bandhan,
చంద్రయాన్,
మోడీ వాళ్లతో కొద్ది సేపు ముచ్చటించారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment