నేడు మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ప్రశంసించారు. అలాగే, జీ-20 సమావేశాలపై మాట్లాడారు. కాగా, మోడీ మన్కీ బాత్లో మాట్లాడుతూ సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకున్నయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని.. గ్రూపును మరింత బలోపేతం చేస్తుందన్నారు. జీ-20కి భారత్ నేతృత్వం అంటే ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని మోడీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అలాగే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'సంస్కృత భారతీ' ఆధ్వర్యంలో 'సంస్కృతంలో మాట్లాడే క్యాంప్' నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. సంస్కృతం అందరూ నేర్చుకోవాలన్నారు. అంతేకాదు తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
Post Top Ad
adg
Sunday, 27 August 2023
Home
National
చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నం
మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ
సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు
చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నం !
చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నం !
Tags
# National
# చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నం
# మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ
# సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు
About Telugu Lo Computer
సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు
Tags
National,
చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నం,
మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ,
సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment