అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు

Telugu Lo Computer
0


వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి కి సీబీఐ మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మొదట ఈనెల 16న విచారణకు రావాలని అవినాష్ రెడ్డి కి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని..4 రోజుల సమయం ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. దీనితో ఈనెల 19న విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. అయితే తన తల్లికి అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని రెండోసారి కూడా అవినాష్ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో సీబీఐ మూడోసారి నోటీసులు జారీ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)