ఎటు చూసినా నీళ్లే !

Telugu Lo Computer
0


బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో సిటీ అతలాకుతలం అయింది. చెట్లు నేలకూలాయి, కార్లు, బండ్లు వరదలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు కరెంట్ కట్ అయింది. నగరంలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఎటు చూసినా నీళ్లే. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు హై అలర్ట్ ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టారు. మైసూరులోనూ కుండపోత వర్షం కురిసింది. బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ముందస్తు రుతుపవనాలు బెంగళూరును నాశనం చేస్తున్నాయని కర్నాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రీ మాన్​సూన్ ఎఫెక్ట్​ను ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. వర్షాల ఎఫెక్ట్​తో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 52మంది మృత్యువాత పడ్డారని వెల్లడించారు. ఈ వర్షాలకు 814 ఇండ్లు దెబ్బతిన్నాయని, 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించామని, పంట నష్టంపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. వర్షం, వరద ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ రెడీ చేసింది. సిటీ అంతటా సబ్​డివిజనల్ స్థాయిలో 63 కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)