చరిత్ర సృష్టించిన ఆర్‌.వి.దేశ్‌పాండే !

Telugu Lo Computer
0


కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆర్‌.వి.దేశ్‌పాండే (76) తొమ్మిదోసారి విధానసభ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన హళియాళ విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొమ్మిదోసారి విధానసౌధ బాటపట్టారు. 1976 నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రామకృష్ణహెగ్డే నేతృత్వంలో 1980లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి నేటి వరకు ఓటమి అనేది ఎరగకుండా విజయం సాధిస్తున్నారు. గతంలో ప్రాథమిక విద్య, రెవెన్యూ, భారీ పరిశ్రమలు, ఆరోగ్యం తదితర శాఖలను నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు విధానసభకు మల్లికార్జున ఖర్గే, ధరంసింగ్‌ ఎన్నికయ్యారు. వారి జాబితాలో ఆర్‌.వి.దేశ్‌పాండే చేరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)