కర్ణాటకలో బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ప్రచారానికి కర్ణాటక చేరుకున్న ఆయన మెగా రోడ్ షో ప్రారంభించారు. బెంగళూరులో ప్రధాని మోడీ రోడ్షో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఆయన రోడ్ షో సాగనుంది. వేలాది మంది ప్రజలు ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు. ప్రధాని ర్యాలీలో జై భజరంగబలి నినాదాలు మార్మోగాయి. ప్రధాని రోడ్షో 26 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ప్రధానిని చూసేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. బెంగళూరులో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రధాని రోడ్షో మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగనుంది. ఈ రోడ్ షోలో 10 లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా.
కర్ణాటకలో కొనసాగుతున్న ప్రధాని మోడీ మెగా రోడ్ షో !
May 06, 2023
0
Tags