అరుణ్‌చల్‌ ప్రదేశ్‌, మయన్మార్‌లో భూకంపం

Telugu Lo Computer
0


ఈరోజు ఉదయం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌కి 86 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ తెలిపింది. పొడవు 97.04, వెడల్పు 27.05, 14 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం సంభవించిన సమయంలోనే మయన్మార్‌లో కూడా ఈరోజు భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 8.15 గంటల సమయంలో.. 4.5 తీవ్రతతో, 14 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ వెల్లడించింది. మయన్మార్‌లో మే నెలలోనే భూకంపం సంభవించడం ఇది రెండోసారి. మే 2వ తేదీన మయన్మార్‌లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)