మండపం దగ్గర విషం తాగిన వధూవరులు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ ప్రాంతానికి చెందిన యువతి, యువకుడికి ఇరువురి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మంగళవారం పెళ్లి కావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంధువులంతా మండపానికి చేరుకున్నారు. పిల్లలు, పెద్దలతో అంతా హడావిడిగా మారిపోయింది. ఇక మరికాసేపట్లో పెళ్లి అనగా మండపం దగ్గరే వధూవరులు గొడవ పడ్డారు. ఇదే కోపంతో ముందుగా వరుడు విషం తాగాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు కూడా పాయిజన్ తాగింది. దీంతో వెంటనే స్పందించిన ఇరువురి కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోవడంతో వరుడు మరణించగా, వధువు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వధువు వరుడిని తొందరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. దీనికి వరుడు మాత్రం నాకు రెండేళ్ల టైమ్ కావాలని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటూ వివరించే ప్రయత్నం చేశాడు. అయినా వెనకడుగు వేయని వధువు, ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇరువురి నిర్ణయం మేరకు మంగళవారం పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక కాసేపట్లో పెళ్లి అనగా ఇదే విషయంపై వధూవరులు మరోసారి గొడవ పడి విషం తాగారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)