ఉత్తరప్రదేశ్ లోని లక్నో, ఝాన్సీ ప్రాంతంలో పవన్-ప్రియాంక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కిందటే వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్నికొనసాగించారు. ఇటీవల ఓ రోజు రాత్రి ప్రియాంక అన్నం, కూర వండి భర్త కోసం రెడీగా పెట్టింది. ఇదే సమయంలో పవన్ ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూనే చికెన్ వండాలని భార్యను కోరాడు. అప్పటికే కూర వండానని భార్య చెప్పింది. పవన్ వినకుండా ఖచ్చితంగా చికెన్ వండాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. ఇక ఇదే విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ గదిలోకి వెళ్లి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. పవన్ సోదరుడు వెంటనే స్పందించి తలుపులు బద్దలు కొట్టి చూడగా అతడు అప్పటికే మరణించాడు. ఆ తర్వాత మృతుడి సోదరుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణాన్ని బలిగొన్న కోడి కూర వివాదం !
May 26, 2023
0
Tags