కాంగ్రెస్‌లో చేరిన గిరిజన నాయకుడు నంద్ కుమార్‌ సాయి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 May 2023

కాంగ్రెస్‌లో చేరిన గిరిజన నాయకుడు నంద్ కుమార్‌ సాయి


ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, గిరిజన నాయకుడు నంద్‌ కుమార్‌ సాయి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీని విడిచిపెట్టడం తనకు కఠినమైన నిర్ణయమని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని భూపేష్ బఘేల్ ప్రభుత్వ పనులు తనకు నచ్చాయన్నారు.  ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం. నేను జనసంఘ్ కాలం నుంచి బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నాను. అటల్‌జీ నాయకత్వంలో పనిచేశాను. నేను ఇక్కడ సీఎం బఘేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనిని సమీక్షించాను. నర్వా గర్వా ఘుర్వా బడి భావన నాకు నచ్చింది.” అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆయనను పార్టీలోకి స్వాగతించారు. గిరిజన నాయకుడు ఎల్లప్పుడూ సమాజ సంక్షేమం కోసం పనిచేశారని అన్నారు.”సాయి ఎల్లప్పుడూ గిరిజన సంఘం ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఆయన నిజమైన గిరిజన నాయకుడు.” అని ముఖ్యమంత్రి అన్నారు. నంద్ కుమార్ సాయి  బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు సాయి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దిగజార్చుతున్నారని, బీజేపీలో తనపై కుట్రలు జరుగుతున్నాయన్నారు.బీజేపీలో ప్రముఖ గిరిజన నాయకుడు అయిన నంద్‌ కుమార్‌ సాయి అనేక కీలక పదవులు నిర్వహించారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2003-2005 మధ్య ఛత్తీస్‌గఢ్ బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. ఆయన 1997-2000 మధ్యప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

No comments:

Post a Comment