ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బరిపాడలోని మహారాజా శ్రీ రామచంద్ర భంజదేవ్ వర్సిటీ 12 స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మైక్ సిస్టమ్ సహా వేదిక అంతా చీకట్లో మునిగిపోయింది. శనివారం ఉదయం 11.56నిమిషాల నుండి 12.05 నిమిషాల వరకు సుమారు 9 నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చీకట్లోనే రాష్ట్రపతి ప్రసంగం కొనసాగించారు. చీకటి వెలుగులను సమానంగా చూడాలనే విషయాన్ని ఈ ఘటన నుంచి నేర్చుకోవాలని విద్యార్థులనుద్దేశించి అన్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. టాటా పవర్, నార్త్ ఒడిశా పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సిఇఒ భాస్కర్ సర్కార్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగలేదని, వైరింగ్లో లోపం కారణంగా విద్యుత్ నిలిచిపోయిందని అన్నారు. ఈ ఘటనపై యూనివర్శిటీ వైస్ చాన్సలర్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం సమయంలో విద్యుత్ సరఫరాలో లోపం తలెత్తడంపై క్షమాపణలు తెలిపారు. జనరేటర్ ఉన్నప్పటికీ ఆ సమయంలో ఉపయోగం లేకపోయింది.
చీకట్లోనే ప్రసంగించిన రాష్ట్రపతి !
May 07, 2023
0
Tags