కన్న బిడ్డను చంపిన సైకో !

Telugu Lo Computer
0


తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లికి చెందిన సదయ్య ఓ సైకో. 6 నెలలు కిందట భార్యను హతమార్చాడు. ఈ కేసులు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ కూతురినే చంపేశాడు. కారణం లేకుండా కూతురిని చంపడమే కాకుండా దూపం శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా సదయ్య హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సైకో సదయ్యను తమకు అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని జనాలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)